EC : ఈశాన్యంలో నేడే కౌంటింగ్

EC : ఈశాన్యంలో నేడే కౌంటింగ్
ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది

ఈశాన్యంలో గెలిచేదెవరో నేడు తేలనుంది. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశముంది.

ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. నాగాలాండ్, మేఘాలయల్లో ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ సీటు ఏకీగ్రీవమయ్యాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్‌, మేఘాలయాలో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరిగింది. మేఘాలయలో 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 78 శాతం, నాగాలాండ్‌లో 59 స్థానాలకు 86 శాతం, త్రిపురలో 60 స్థానాలకు 87 శాతం పోలింగ్‌ నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story