ఎన్నికల ప్రచారంలో దూకుడుమీదున్న దీదీకి షాక్

ఎన్నికల ప్రచారంలో దూకుడుమీదున్న దీదీకి షాక్
హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఇటీవలే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో దూకుడుమీదున్న దీదీకి షాక్ తగిలింది. ఓట్లు చీలిపోనివ్వొద్దని, వేరే పార్టీలకు ఓటేయొద్దని, తమ పార్టీకే ఓటేయాలని ఆమె మైనార్టీలను విజ్ఞప్తి చేయడంపై దుమారం రేగింది. హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఇటీవలే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మమత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఈసీ... మత ప్రాతిపాదికన ఓట్లు అడగడంపై 48 గంటల్లో సమాధానం చెప్పాలని మమతకు నోటీలు ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story