ఆ రాష్ట్రాలకి మోగిన ఎన్నికల నగారా !

X
By - TV5 Digital Team |26 Feb 2021 4:48 PM IST
దేశవ్యాప్తంగా పలు లోక్ సభ స్థానాలతో పాటుగా నాలుగు రాష్ట్రాలకి, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేసింది ఎన్నికల కమిషన్
దేశవ్యాప్తంగా పలు లోక్ సభ స్థానాలతో పాటుగా నాలుగు రాష్ట్రాలకి, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి శుక్రవారం ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్ .. కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, పచ్చిమ బెంగాల్ రాష్ట్రాలకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లోని 294 శాసనసభ స్థానాలకు, తమిళనాడులోని 234 స్థానాలకు, కేరళలోని 140 స్థానాలకు, అసోంలోని 126 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 శాసనసభ స్థానాలకు గాను ఎన్నికల షెడ్యూల్ వెల్లడైంది. అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లోని ఖాళీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక షెడ్యూల్ను ప్రకటించింది. కాగా కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే ఎన్నికలను నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com