Chennai: రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి!!

Chennai: రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి!!
Chennai: ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి తన ప్రియురాలి అక్క రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ మృతి చెందాడు.

Chennai: ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి తన ప్రియురాలి అక్క రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ మృతి చెందాడు. చెన్నైలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో వివాహ రిసెప్షన్ జరిగింది. అతిథులు ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. వారిలో ఒకరు సత్యసాయి రెడ్డి. రిసెప్షన్ వేదిక దగ్గర జరిగిన సంగీత కచేరీలో సంగీతానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా సత్యసాయి నేలపై కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు, పెళ్లికి వచ్చిన అతిథులు అతను పడిపోవడం చూసి షాక్ అయ్యారు. అందరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కొద్ది క్షణాల తర్వాత సత్యసాయికి మూర్ఛ రావడంతో చెవి నుంచి రక్తం రావడం మొదలైంది. ఏం చేయాలో తెలియక అతని స్నేహితులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సత్యసాయిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే సత్యసాయి కన్నుమూశాడని చెప్పారు. వివాహ రిసెప్షన్‌లో సత్యసాయి మరణవార్త అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సత్యసాయి తల్లిదండ్రులకు తమ కుమారుడి మరణవార్త విని గుండెలు బాదుకున్నారు. సత్యసాయి గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నందున ఈ వార్త ఆందోళనకరంగా ఉంది. శారీరక శ్రమ లేకపోవడం, పొగాకు వినియోగం, మద్యపానం వంటి అలవాట్లతో పాటు జీవనశైలి గుండె జబ్బులకు దారితీస్తున్నట్లు హుద్రోగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచంలో గుండె జబ్బుల కారణంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాలలో భారతదేశం ఒకటి.

Tags

Read MoreRead Less
Next Story