EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్..

X
By - Prasanna |30 Dec 2021 12:27 PM IST
EPFO: దీంతో పోర్టల్ డౌన్ అవుతోంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో స్పందించిన సంస్థ..
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులు నామినీ వివరాల నమోదుకు గడువు ఈనెల 31వ తేదీ వరకే అని గతంలో ప్రకటించింది. కానీ గత రెండు రోజులుగా ఈపీఎఫ్వో వెబ్సైట్ సరిగా పనిచేయట్లేదు. దీంతో పోర్టల్ డౌన్ అవుతోంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో స్పందించిన సంస్థ.. డిసెంబర్ 31 తరువాత కూడా నామినీల వివరాల అప్లోడ్కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
బుధవారం, EPFO ట్విట్టర్లో, "మీరు డిసెంబర్ 31, 2021 తర్వాత కూడా నామినేషన్లను సమర్పించవచ్చు అని సంస్థ ప్రకటించింది." అయితే ఈ-నామినేషన్ల సమర్పణకు గడువు విధించలేదు. కస్టమర్లు ఎంతకాలం నామినీలను జోడించవచ్చో EPFO పేర్కొనలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com