Manmohan Singh : మన్మోహన్ సింగ్కి అస్వస్థత.. ఎయిమ్స్లో చికిత్స

X
By - /TV5 Digital Team |13 Oct 2021 7:14 PM IST
Manmohan Singh : దేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో వెంటనే ఆయనని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు.
Manmohan Singh : దేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో వెంటనే ఆయనని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ డాక్టర్ రణ్ దీప్ గులేరియా, ఎయిమ్స్ నేతృత్వంలో వైద్య బృందం ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో కరోనా కారణంగా ఆయన ఎయిమ్స్లో చేరారు. 2009లో మన్మోహన్ సింగ్ ఎయిమ్స్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. 2004 నుండి 2014 వరకు దేశ ప్రధానగా కొనసాగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com