ప్రజలు మోదీని చూసి చాలా నేర్చుకోవాలి.. ప్రధాని పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశంసలు.. !

X
By - TV5 Digital Team |28 Feb 2021 5:00 PM IST
ప్రజలు మోదీ నుండి చాలా నేర్చుకోవాలని అన్నారు. మోడీ ప్రధాని అయినప్పటికీ.. ఎప్పుడూ కూడా తన మూలాలను మరచిపోలేదని అన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. జమ్మూలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గుజ్జర్ కమ్యూనిటి సభ్యులను ఉద్దేశిస్తూ మోదీ గురించి మాట్లాడారు.. ప్రజలు మోదీ నుండి చాలా నేర్చుకోవాలని అన్నారు. మోదీ ప్రధాని అయినప్పటికీ.. ఎప్పుడూ కూడా తన మూలాలను మరచిపోలేదని అన్నారు. తన చిన్నతనంలో గిన్నెలు తోమేవాడినని, టాయిలెట్లు కడిగేవాడినని, టీ అమ్మేవాడినని మోడీ చాలాసార్లు గర్వంగా చెప్పారని అన్నారు. మనం ఏ స్థాయికి ఎదిగినా గతాన్ని మర్చిపోకూడదని అన్నారు. కాగా ఇటీవల ఆజాద్.. రాజ్యసభకి రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా మోదీ కన్నీటి పర్యంతం అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com