హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు పసిడి ధరలు.. బంగారం ధర స్వల్పంగా, వెండి ధర ఎక్కువగా ..

ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారు రేటు నిన్నటి రేటుతో పోల్చినప్పుడు కొంత పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 లు పెరిగి రూ. 53, 310కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50లు పెరిగి రూ.48,870కు చేరింది.
వెండి ధర బాగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.890పెరిగి రూ.63,800కు చేరుకుంది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చాయి. ఔన్స్ బంగారం ధర 0.34 శాతం తగ్గుదలతో 1922 డాలర్లకు క్షీణించింది. వెండి ధర కూడా అదే బాటలో పయనించి ఔన్సుకు 073 శాతం తగ్గుదలతో 25.09 డాలర్లకు పడిపోయింది.
బంగారం, వెండి ధరల పెరుగుదలకు పలు అంశాలు ప్రభావం చూపిస్తాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com