మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర..

ఒకవైపు పెట్రో మంట, మరోవైపు వంట గ్యాస్ ధర పెంపు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కనీసం మూడు రోజులైనా కాలేదు బడ్జెట్ ప్రవేశ పెట్టి.. ఆ రోజు యథాతథంగా ఉంచిన వంట గ్యాస్ ధర, తాజాగా రాయితీ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ఈ రోజు నుంచి (గురువారం) కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. చమురు సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎల్పీజీ సిలిండర్ ధర తాజాగా రూ.25లు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధర రూ.184 పెరిగింది. ప్రస్తుత ధరల పెంపు తరువాత హైదరాబాద్లో వినియోగదారులు సిలిండర్కు రూ.771.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర రూ.746.50గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోలు సిలిండర్ రూ.664 నుంచి రూ.719కి పెరిగింది. కోల్కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com