Bihar: డీజే సౌండ్కి వేదిక మీదే కుప్పకూలిన వరుడు..
Bihar: ఉన్నపళంగా తనువు చాలిస్తున్న సంఘటనలు గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్నాయి. డీజే సౌండ్ భరించలేని పెళ్లి కొడుకు కొంత అసహనానికి గురయ్యాడు. అంతలోనే అందరూ ఆనందంలో మునిగితేలుతున్న సమయంలో వరుడు తలవాల్చేశాడు. ఈ హఠాత్ పరిణామానికి కంగారు పడ్డ కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. బీహార్లోని సీతామర్హి జిల్లాలో వివాహ వేడుక జరిగిన కొద్ది క్షణాలకే వరుడు వేదికపై కుప్పకూలిపోయాడు. వరుడు DJ సంగీతం హోరుకి కొంత ఇబ్బంది పడ్డాడు. ఇదే అతని మరణానికి దారితీసి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. వరుడు సురేంద్ర కుమార్ను స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
దంపతులు దండలు మార్చుకుని ఇతర పూజలు చేశారు. సురేంద్ర తన పెళ్లి ఊరేగింపులో ప్లే అవుతున్న DJ యొక్క శబ్దం గురించి పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. చివరికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తర్వాత, DJలపై కఠినమైన నిషేధం ఉన్నప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోవట్లేదని అన్నారు.. సామాజిక కార్యకర్త డాక్టర్ రాజీవ్ కుమార్ మిశ్రా DJలపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com