Gurugram: మైనర్ బాలికపై జంట లైంగిక దాడి
గురుగ్రామ్లో దారుణం చోటుచేసుకుంది. 14ఏళ్ల మైనర్ బాలికను ఓ దంపతులు లైంగికంగా వేధించడమే కాకుండా శారీరకంగానూ హింసించారు. పోలీసులు తెలిపిప వివరాల ప్రకారం మంగళవారం పోలీసులు సఖీ అనే స్వచ్చంద సంస్థ కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్లో ఈ అమానుష ఘటన బయట పడింది. గురుగ్రమ్లోని న్యూకాలనీకి చెందిన జంట కేర్టేకర్గా ఆ బాలికను తీసుకున్నారు. న్యూకాలనీలో నివాసముంటూ ప్రైయివేటు ఉద్యోగులుగా పని చేస్తున్న జంట సదరు బాలికను శారీరకంగా హింసిస్తూ లైంగిక దాడులకు పాల్పడ్డారనీ, బాలిక మెహం మీద నోటిమీద అలాగే కాళ్లూ చేతుల మీద గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. రాంచీకి చెందిన మైనర్ బాలికను ఏజెన్సీ ద్వారా ఐదు నెలల క్రితం తమ మూడున్నరేళ్ల కూతురికి కేర్ టేకర్గా చేర్చుకున్నారు. అనంతరం పనులు చేయిస్తూ ప్రతి రోజు దారుణంగా కొట్టేవారు. రాత్రంతా నిద్రపోనిచ్చేవారు కాదని, అన్నం కూడా పెట్టేవారు కాదని వెల్లడైంది. ఆకలికి తాళలేక బాలిక చెత్త డబ్బాలో వదిలేసిన ఆహారాన్ని తిన్నాదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నోరు మొత్తం గాయాలతో వాచిపోయిందని శరీరమంతటా గాయాలతో నిండిపోయిందని సఖీ సంస్థ ఇన్ఛార్జీ పింకీ మాలిక్ తెలిపారు. బాలిక ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తను క్లిష్ట పరిస్థితిలో ఉందని ఆమె తెలిపారు. ఇంత దారుణానికి ఒడికట్టిన జంటపై పోలీసులు సెక్షన్ 323, 342, పోక్సో చట్టాల కింద న్యూకాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com