కరోనా టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదు : మంత్రి హర్షవర్ధన్

కరోనా టీకాపై  ఎలాంటి అపోహలు అవసరం లేదు : మంత్రి హర్షవర్ధన్
కరోనా టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. లోక్‌సభ వేదికగా మరోసారి భరోసా ఇచ్చారాయన.

కరోనా టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. లోక్‌సభ వేదికగా మరోసారి భరోసా ఇచ్చారాయన. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రతి టీకాకు యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ అవసరం లేదని.. మొదట వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తరవాత 60ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందిస్తున్నామన్నారు. నిపుణుల సూచనల ఆధారంగా రానున్న రోజుల్లో టీకా కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామన్నారు. భారతీయ నిపుణులతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపామన్నారు హర్షవర్ధన్‌.

వైద్య నిపుణులు చెప్పిన సూచనలు ప్రకారం..దేశంలో ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాల్సిన పని లేదన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా వైరస్ తీరును బట్టి..టీకా కార్యక్రమంలో మార్పులు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరు టీకాకు సంబంధించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు కేంద్రమంత్రి హర్షవర్ధన్‌. ఇప్పటివరకు దాదాపు 4 కోట్ల మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. జనవరి 16న ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

Tags

Read MoreRead Less
Next Story