కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా
By - Nagesh Swarna |27 Dec 2020 12:00 PM GMT
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా.. గువహటిలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిస్వా శర్మ ఆయన వెంట ఉన్నారు. అంతకు ముందు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి జరిపిన సమావేశంలో సమీక్షించారు. అసోం మాజీ మంత్రి, గోలాహట్ ఎమ్మెల్యే అజంతా నియోగ్ సైతం అమిత్షాను కలుసుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు ఆమె ప్రకటించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com