ప్రేమించి మతం మార్చుకొని పెళ్లి.. ఉగ్రవాదిగా జైల్లో భారత డెంటిస్ట్‌..!

ప్రేమించి మతం మార్చుకొని పెళ్లి.. ఉగ్రవాదిగా జైల్లో భారత డెంటిస్ట్‌..!
ఆఫ్గనిస్తాన్, తాలిబన్లు.. ఇప్పుడు ఏ నలుగురు ఒక చోట కలిసిన ఈ రెండే పదాలే వినిపిస్తున్నాయి. ఆఫ్గనిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ల వశమైంది.

ఆఫ్గనిస్తాన్, తాలిబన్లు.. ఇప్పుడు ఏ నలుగురు ఒక చోట కలిసిన ఈ రెండే పదాలే వినిపిస్తున్నాయి. ఆఫ్గనిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ల వశమైంది. అక్కడ ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు దేశం దాటి పారిపోతుంటే మరికొందరు మాత్రం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. సాధారణ ప్రజలు మాత్రమే కాదు జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితి కూడా ఇంతే.. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. ఆ లిస్టులో కేరళకి చెందిన ఓ యువతి కూడా ఉంది. ఆమె కథ వింటే కన్నీళ్లు ఆగవు.


ఆమె పేరు నిమిష కేరళలోని తిరువనంతపురానికి చెందిన యువతి.. బిందు, సంపత్‌ల కుమార్తె.. బాగా చదువుకుంది. యువ వైద్యురాలు కూడా.. ఆమె ఒకరిని ప్రేమించింది. పెద్దలు కాదన్నా అతన్ని మతం మార్చుకొని మరి పెళ్ళిచేసుకుంది. పెళ్లి అయ్యాక ఆమె పేరు ఫాతిమాగా మార్చుకుంది. 2016లో భర్తతో కలిసి నిమిష అఫ్గనిస్తాన్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్ళాక భర్తతో కలిసి ఉగ్రవాదిగా మారింది. ఈ క్రమంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కాల్పుల్లో భర్త మరణించాడు.

దీనితో ఆమెకి భయం పట్టుకుంది. పాపతో కలిసి అఫ్గాన్‌ ప్రభుత్వానికి లొంగిపోయింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు తాలిబన్లు చేతిలో ఆఫ్గనిస్తాన్ ఉండడంతో ఫాతిమా తల్లి బిందు ఆందోళనలో పడ్డారు. తన కుమార్తెను విడిపించి దేశానికి తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలనీ ఆమె కేంద్ర ప్రభుత్వానికి 1,882 సార్లు విజ్ఞప్తి చేసింది. తన కూతురు ఉగ్రవాది కాదని, ఆమె రావడం వాళ్ళ దేశానికి ఎలాంటి ముప్పు లేదని వాపోతుంది. కనిపించిన మంత్రి, ఎమ్మెల్యేలందరినీ కోరుతోంది.


అయితే ఫాతిమాతో పాటుగా మరో 20 మంది యువతులు అఫ్గాన్‌ వెళ్లారని తెలిసింది. అందులో ముగ్గరు ఫాతిమా లాగా మతం మార్చుకొని ఇప్పుడు జైల్లోనే ఉన్నారని వారిని కూడా విడిపించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story