మరో విజయం.. హైపర్సోనిక్ మిసైల్ క్లబ్ లో చేరిన భారత్..
By - kasi |7 Sep 2020 11:18 AM GMT
భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) దేశంలో మరో ఘనత సాధించింది. హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్..
భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) దేశంలో మరో ఘనత సాధించింది. హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ (హెచ్ఎస్టిడివి) ఉత్పత్తి చేయడంలో విజయవంతమైంది. ఒడిశాలోని బాలసోర్లోని ఎపిజె అబ్దుల్ కలాం రేంజ్లో సోమవారం దీనిని పరీక్షించారు. స్క్రామ్జెట్ (హై స్పీడ్) ఇంజిన్ సహాయంతో దీనిని ప్రయోగించారు. దీంతో ప్రపంచంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించిన నాల్గవ దేశంగా భారత్ అవతరించింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనా కూడా ఈ ఘనత సాధించాయి. హైపర్సోనిక్ క్షిపణులు సెకనులో 2 కి.మీ వరకు దాడి చేయగలవు. వాటి వేగం ధ్వని వేగం కంటే 6 రెట్లు ఎక్కువ.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com