అంతర్జాతీయ విమానాలు మరో నెల రోజుల వరకు..

అంతర్జాతీయ వాణిజ్య విమానాల నిషేధాన్ని ప్రభుత్వం శుక్రవారం జూన్ 30 వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) సర్క్యులర్లో తెలిపింది. విమానాల సస్పెన్షన్ గడువు మే 31 తో ముగస్తుంది. కానీ కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అంతర్జాతీయ విమానాల రాకపోకలకు మరోసారి అడ్డుకట్ట వేసింది.
"అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో కేసుల ఆధారంగా అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను అనుమతించవచ్చు" అని ఇది తెలిపింది.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి 23 నుండి భారతదేశంలో అంతర్జాతీయ విమానాలు నిలిపివేయబడ్డాయి.
అయినప్పటికీ, గత ఏడాది మే నుండి 'వందే భారత్ మిషన్' కింద మరియు జూలై నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక "ఎయిర్ బబుల్" ఏర్పాట్ల కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com