Jharkhand: భర్తను చంపి... పోలీసులు రాకుండా తలుపుకు కరెంట్...

Jharkhand: భర్తను చంపి... పోలీసులు రాకుండా తలుపుకు కరెంట్...
జార్ఘండ్ లోని జమ్షెడ్ పూర్ లో చోటుచేసుకున్న ఘటన
ఓ మహిళ తన భర్తను చంపి, పోలీసుల అరెస్ట్ ను నివారించేందుకు తలుపులకు కెరెంట్ పెట్టిన ఘటన ఝార్ఖండ్ లోని జమ్షెడ్పూర్ లో చోటుచేసుకుంది. ఓల్డ్ సుభాష్ కాలనీకి చెందిన ట్రాన్స్ పోర్ట్ , రియల్ ఎస్టేట్ వ్యాపారస్థుడు అమర్నాథ్ సింగ్, భార్యా మీరా సింగ్, ఇద్దరు పిల్లలతో కలసి స్థానికంగా నివశిస్తున్నాడు. అయితే పిల్లలు ఇద్దరూ చదువులు, ఉద్యోగాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. అయితే మీరా సింగ్ మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు వారి పెద్ద కుమారుడికి సమాచారం అందించారు. ఈ క్రమంలో మీరా సింగ్ మేడపైకి వెళ్లి గట్టిగా కేకలు వేసినట్లు ఇరుగుపొరుగు చెబుతున్నారు. పోలీసులను ఇంటి లోపలికి రాకుండా నివారించేందుకు గుమ్మానికి కరెంట్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు మీరా సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కూ, మృతుడిని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story