Jodo Yatra : రాహుల్ యాత్రలో రంగీలా చిన్నది

Jodo Yatra : రాహుల్ యాత్రలో రంగీలా చిన్నది
జమ్మూ కశ్మీర్ లో కొనసాాగుతున్న 'భారత్ జోడో యాత్ర'; యాత్రలో పాలుపంచుకున్న ఊర్మిళ; సమానత్వం కోసం కలిసి నడవండి అంటూ పిలుపు....


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన 'భారత్ జోడో యాత్ర' జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతోంది. తాజాగా 'జోడో యాత్ర'లో బాలీవుడ్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ పాల్గొన్నారు. ఈరోజు జమ్మూలోని నగ్రోటా నుంచి యాత్ర ప్రారంభమైంది. యాత్రలో రాహుల్ తో కలిసి నడిచిన ఉర్మిల తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ప్రస్తుతం జమ్ములో ఉన్నానని జోడో యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.

జోడో యాత్రకు పార్టీతో గాని, వ్యక్తితో గాని సంబంధం లేదని తెలిపారు ఊర్మిల. కేవలం భారతీయత అనే సెంటిమెంట్ మాత్రమే ప్రజలందరినీ కలుపుకుంటూ వస్తుందని ఊర్మిల చెప్పారు. ప్రపంచం ప్రేమ, సద్భావనతోనే పని చేస్తుందని, భయం లేదా ద్వేషంతో కాదని అభిప్రాయపడ్డారు. జోడో యాత్ర గురించి ఊర్మిల మాట్లాడుతూ.. రాజకీయ కోణంలో కంటే, సామాజిక కోణంలోనే యాత్రకు ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు తెలిపారు.

రాహుల్ గాంధీతో కలిసి నడిచిన వీడియోను ఊర్మిల ట్విట్టర్ లో షేర్ చేశారు. "ఐక్యత, అనుబంధం, సమానత్వం, సోదరభావం కోసం జోడో యాత్రలో కలిసి నడవండి" అని పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి ప్రారంభమైన జోడో యాత్ర చివరి దశకు చేరుకుంది.

Tags

Read MoreRead Less
Next Story