Karnataka: మెటర్నటీ వార్డు నుంచి పసికందును ఎత్తుకెళ్లిన శునకం
By - Chitralekha |3 April 2023 7:24 AM GMT
కర్ణాటకలోని శివమొగ్గలో దారుణం, ప్రభుత్వ మెటర్నటీవార్డులో కుక్కల స్వైర్విహారం, పసికందు మృతి
దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట వీధికుక్కల వల్ల జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్ లో చేటుచేసుకున్న విషాదం మరువక ముందే కర్ణాటకలోని శివమొగ్గలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. మెటర్నటీ వార్డులో రోజుల పసుకందును నోట కరచుకున్న కుక్క ఆసుపత్రి ఆవరణలో స్వైర్విహారం చేసింది. శునకం నోట్లో ఏదో ఉందని గమనించిన ఆసుపత్రి సిబ్బంది అది పసికందు అని గుర్తించి కుక్క నోటి నుంచి దాన్ని విడిపించారు. కానీ, చిన్నారిని పరీక్షలకు పంపేలోగానే ప్రాణాలు విడిచింది. దీంతో పసికందు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com