Karnataka Election 2023: మే 10న ఎన్నికలు, మే13న రిజల్ట్స్

కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మే10న కర్ణాటక ఎన్నికలు జరుగనున్నాయని, మే 13న ఫలితాలు వెల్లడించనున్నట్లు భారత ఎన్నికల సంఘం బుధవారం వెళ్లడించింది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి (మార్చి 29) నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) అమలు కానుంది.
కాంగ్రెస్ పార్టీ మార్చి 25న 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నుంచి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇదే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానని సిద్ధరామయ్య అన్నారు. తాను వరుణ నియోజకవర్గం కుమారుడినని, అందుకే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అయితే కోలార్ ప్రజలు నాపై ప్రేమ చూపి అక్కడి నుంచి కూడా పోటీకి దిగాలని కోరారని, అందుకే కోలార్ నుంచి కూడా టికెట్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ని కోరినట్లు ఆయన తెలిపారు.
మార్చి 20న, మార్చి 20న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 80 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని పార్టీ ప్రకటించింది. కర్ణాటక శాసనసభ పదవీకాలం మే 24, 2023తో ముగియనుంది. రాష్ట్రంలో గతంలో అసెంబ్లీ ఎన్నికలు మే 2018లో జరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com