Kerala : లాటరీ గెలిచాక పోలీస్ స్టేషన్ కు పరిగెత్తాడు

Kerala : లాటరీ గెలిచాక పోలీస్ స్టేషన్ కు పరిగెత్తాడు
కేరళ ప్రభుత్వ స్త్రీ శక్తి లాటరీలో రూ.75 లక్షలు గెలుచుకున్నాడు.

కేరళలో ఓ కార్మికుడు రూ. 75 లక్షల లాటరీని గెల్చుకున్నాడు. లాటరీ గెలిచిన విషయం తెలియగానే స్థానిక పోలీస్టేషన్ కు పరిగెత్తాడు. తన ప్రైజ్ మనీకి రక్షణ కల్పించాలని కోరాడు.

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎస్ కె బాదేశ్ అనే వ్యక్తి కేరళలో రోడ్డు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కేరళ ప్రభుత్వ స్త్రీ శక్తి లాటరీలో రూ.75 లక్షలు గెలుచుకున్నాడు. తనకు మళయాలం రాకపోవడం ఓకెత్తైతే, లాటరీ గెలిచాక ఎవరిని సంప్రదించాలో తెలియలేదని తెలిపాడు. ఎవరైనా తన టికెట్ ను లాక్కుంటారేమోనని భయపడ్డానని అందుకే స్థానిక పోలీస్టేషన్ కు వెళ్లినట్లు తెలిపాడు.

మువట్టుపుజ పోలీసులు.. బాదేశ్ కు విధివిధానాలు అర్థమయ్యేలా చేసి అన్ని రకాల భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతకు ముందు కూడా లాటరీతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లు తెలిపాడు. కానీ ఎప్పుడూ గెలవలేదని చెప్పాడు. ప్రస్తుతం లాటరీ గెలవడం సంతోషాన్నించిందని అన్నాడు. డబ్బు రాగానే బెంగాల్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లాలని బాదేశ్ నిర్ణయించుకున్నాడు. కేరళ తెచ్చిన అదృష్టంతో తన ఇంటిని పునరుద్ధరించుకోవాలని, వ్యవసాయాన్ని విస్తరించాలని అతను ఆశిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story