Kerala Lockdown : మే 8 నుండి కేరళలో సంపూర్ణ లాక్డౌన్
By - TV5 Digital Team |6 May 2021 6:30 AM GMT
కోరనా తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విదిస్తున్నట్టుగా ప్రకటించింది.
Kerala Lockdown : కోరనా తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విదిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తెలిపింది. కేరళలో నిన్న(బుధవారం) ఒక్కరోజే 41,953 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అటు రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై సీఎం విజయన్ అధికారులతో చర్చించారు. కేరళ, కోజికోడ్, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం, అలప్పుజ, పాలక్కాడ్, తిరువనంతపురం, కన్నూర్, కొల్లం జిల్లాల్లో గత రెండు వారాలుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com