గోధుమలు తీద్దామని డ్రమ్ములోకి చూసే సరికి..

X
By - prasanna |12 Sept 2020 3:04 PM IST
గోధుమలు తీయడానికని ఆమె ఆ ఇనుప డ్రమ్ములో చేయి పెడదామనుకుంది. అంతలో బుస్ బుస్ మని సౌండ్ వినిపించింది.
యుపిలోని లఖింపూర్ ఖేరి జిల్లాలోని సుందర్వాల్ పట్టణానికి చెందిన అమరేంద్ర సింగ్ భార్య పిండి పట్టిద్దామని ఇంట్లో నిల్వ ఉంచిన గోధుముల డ్రమ్ము వద్దకు వెళ్లింది. గోధుమలు తీయడానికని ఆమె ఆ ఇనుప డ్రమ్ములో చేయి పెడదామనుకుంది. అంతలో బుస్ బుస్ మని సౌండ్ వినిపించింది. లోపల పాము ఉందేమోనని భయపడి కేకలు వేసింది. దాంతో చుట్టుపక్కల వారు గుమికూడి డ్రమ్ము లోపలికి చూశారు. నిజంగానే అందులో విషసర్పం నాగుపాము కనిపించింది. వెంటనే దాని మీద మూత పెట్టి డ్రమ్ముని బయటకు తీసుకు వచ్చి డ్రమ్ముని పక్కకు వంచారు. దాంతో పాము బయటకు వచ్చి పారిపోవడానికి ప్రయత్నించింది. ఈలోపు పాముల పట్టే వారికి కబురందించడంతో అతడు వచ్చి అత్యంత చాకచక్యంగా దాని తోకను పట్టుకుని ఒక బుట్టలో ఉంచి అడవిలో వదిలేశాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com