Maharastra: ఘోర రోడ్డు ప్రమాదం... 10మంది మృతి

Maharastra: ఘోర రోడ్డు ప్రమాదం... 10మంది మృతి
ప్రమాదానికి గురైన నాసిక్-షిర్డీ బస్సు; ట్రక్కును ఢీ కోట్టిన బస్సు; 10 మంది మృతి; 17 మందికి తీవ్రంగా గాయలు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మది మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఉదయం నాసిక్-షిర్డీ వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకోట్టింది. దీంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారు ఉన్నారు.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతుల సంఖ్య మరి పెరిగే అవకాశముందని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికిగల కారణమని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆవేధన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు సీఎం.

Tags

Read MoreRead Less
Next Story