భార్యకు కేజీ బంగారంతో మంగళసూత్రం.. భర్త బహుమతి

భార్యకు కేజీ బంగారంతో మంగళసూత్రం.. భర్త బహుమతి
మహారాష్ట్రలోని భివాండికి చెందిన దంపతుల వీడియో వైరల్ అయింది.

Bhiwandi: అతడికి భార్య అంటే ఎంత ప్రేమ. మీరూ ఉన్నారు పెళ్లై ఇన్నేళ్లయింది చిన్నమెత్తు బంగారం కొన్నారా.. నా ఒంటి మీద ఉన్న నగలన్నీ మా పుట్టింటి వాళ్లు పెట్టినవే అని ప్రతి ఆలి. ఆయనగారి మీద విరుచుకుపడిపోయే ఉంటుంది.

అయినా అదేం ఆనందం గేదెలను కట్టేసే పలుపుతాడులా అంతలావు గొలుసు, ఓ అందం లేదు చందం లేదు అని మరో మాట. అంత ఎక్కువ బంగారం ఉంటే ఎన్ని రకాల గొలుసులు, నగలు తీసుకోవచ్చు. వార్తల్లోకి ఎక్కాలి, వైరల్ అవ్వాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలిగా అదే చేసుంటారు అని పక్కింటి ఆంటీతో కబుర్లు.

తన భర్త బహుమతిగా ఇచ్చిన మోకాలి పొడవైన "బంగారు" మంగళసూత్రం ధరించిన మహిళ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వారి వివాహ వార్షికోత్సవంలో ఈ జంట పాడుతున్న వీడియో సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది, భార్య భారీ హారము ధరించి ఉంది.

మహారాష్ట్రలోని భివాండికి చెందిన దంపతుల వీడియో వైరల్ అయిన తరువాత, హారము కుటుంబానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నందున పోలీసులు ఆ జంటను గుర్తించారు.

ఆభరణం రోల్డ్ గోల్డ్ ది అని దాన్ని కేవలం రూ .38,000 కు కొనుగోలు చేసినట్లు ప్రశ్నించిన పోలీసులకు వివరించాడు భర్త.

ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, "ఈ వీడియో వైరల్ కావడంతో, ఇది నా దృష్టికి కూడా వచ్చింది. ఇంత బంగారం కలిగి ఉండటం, దాన్ని బహిరంగంగా ప్రదర్శించడం నేరస్థులను ఆహ్వానించడం లాంటిది. వెంటనే మా పోలీసులు వారిని కలిసి వివరణ కోరారు.

ఆమె భర్త బాలా కోలీని గుర్తించి స్టేషన్ కు పిలిపించాము. అయితే అతడు బంగారు మంగళసూత్రం నకిలీదని మాకు చెప్పాడు. అతను దానిని ఒక ఆభరణాల దుకాణం నుండి కొన్నానని అన్నాడు. దాని ధర కేవలం 38,000 రూపాయలు మాత్రమే అని చెప్పాడు. తరువాత తన ఆభరణాన్ని కొనుగోలు చేసిన దుకాణాన్ని చూపించాడు.

బంగారు ఆభరణాలను బహిరంగంగా ప్రదర్శించవద్దని పోలీసులు ప్రజలను కోరారు. నేరస్థులు ఆభరణాల కోసం ప్రాణాలు తీయడానికైనా వెనుకాడడం లేదని అన్నారు.

ఈ నెల ప్రారంభంలో, గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ లోని జీడిమెట్లలో నివసిస్తున్న48 ఏళ్ల గృహిణిని, ఆమె కొడుకుని 15 తులాల బంగారు ఆభరణాలు, 5 లక్షల రూపాయల నగదు కోసం చంపేశారు.

ఆమె భర్త పని నుండి తిరిగి వచ్చేటప్పటికి ఇంటి మొయిన్ డోర్ లాక్ చేయబడి ఉంది. అతను ఇంట్లోకి వెళ్లి చూసేసరికి భార్య, కొడుకు బెడ్ రూమ్ లో నేలపై నిర్జీవంగా పడి ఉన్నారు. వారిని ఒక టవల్ తో మెడకు చుట్టి దుండగులు చంపేశారు. ఈ ఉదంతాన్ని పోలీసులు గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story