Delhi liquor scam: లిక్కర్ స్కాం వ్యవహారం.. డిప్యూటీ సీఎంను విచారించనున్న సీబీఐ

Delhi liquor scam: లిక్కర్ స్కాం వ్యవహారంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కొద్దిసేపట్లో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమల్లో చోటు చేసుకున్న అవినీతికి సంబంధించి సీబీఐ ఆయనకు ఆదివారం సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరుకావాలని కోరింది. ఈ కేసులో ఇప్పటికే మొత్తం ముగ్గురు అరెస్టు అయ్యారు. సమీర్ మహేంద్రు, అభిషేక్రావులను అరెస్టు చేసింది సీబీఐ. విజయ్ నాయర్ను ఎన్ఫోర్స్మెంట్ అరెస్టు చేసింది.
అంతకుముందు సీబీఐ సమన్లపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మనీష్ సిసోడియా. తప్పుడు కేసులో తనను అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ట్వీట్ చేశారు సిసోడియా. గుజరాత్ ఎన్నికల ప్రచారానికి తనను దూరంగా ఉంచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం సిసోడియాకు బాసటగా నిలిచారు. ఇదో తప్పుడు కేసు అని చెప్పారు. సిసోడియా ఇంటిలో జరిపిన సోదాల్లో ఏమి దొరకలేదన్నారు. బ్యాంకు లాకర్లోని ఏమి దొరకలేదన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారానికి సిసోడియాను దూరంగా ఉంచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్లో ప్రతి ఒక్కరు ఆప్ను ప్రమోట్ చేస్తున్నారని చెప్పారు కేజ్రీవాల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com