బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం..!

బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం..!
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బందీగా ఉన్న ఎస్ఐ మురళీ తాతిని మావోయిస్టులు హతమార్చారు.

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బందీగా ఉన్న ఎస్ఐ మురళీ తాతిని మావోయిస్టులు హతమార్చారు. పల్బమ్ పారా దగ్గర మురళీ తాతి మృతదేహాన్ని రోడ్డుపై పడేసిన మావోయిస్టులు.. పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖ వదిలిపెట్టి వెళ్లారు. ఈనెల 21న ఎస్ఐ మురళీని మావోయిస్టులు కిడ్నాప్ చేసారు. ఆయన కుటుంబసభ్యులు మురళీని విడిచిపెట్టాలని పలుమార్లు కోరారు. అటు ఎస్ఐ విడుదలకు గోండ్వానా సమాజ్ కోఆర్డినేషన్ కమిటీ యత్నించింది. అయితే ఓవైపు చర్చలు జరుపుతుండగానే.. మరోవైపు మురళీని మావోయిస్టులు చంపేసారు.

ఎస్ఐ మురళీ తాతి 2006లో అనేక అరాచకాలకు పాల్పడ్డారని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. సల్వా జుడం నుండి 2021 DRG పోలీస్ శాఖలో పని చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని పలు ఆదివాసీ గ్రామాల్లో ఎస్ఐ మురళీ.. అమాయక గిరిజనులను మట్టుబెట్టాడని పేర్కొన్నారు. గిరిజన మహిళలను అత్యాచారం చేసి దారుణంగా చంపేశారని తెలిపారు. పలుమార్లు హెచ్చరికలు చేసినా మురళీ తన తీరు మార్చుకోలేదని.. అందుకే ప్రజాకోర్టు నిర్వహించి చంపామని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story