ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల భారీ విధ్వంసం..

X
By - TV5 Digital Team |26 April 2021 12:00 PM IST
ఆదివారం రాత్రి సుక్మా జిల్లా ఎర్రబోరు సమీపంలో 30వ నెంబరు జాతీయ రహదారిపై పది వాహనాలను అడ్డుకొని నిప్పు పెట్టారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి సుక్మా జిల్లా ఎర్రబోరు సమీపంలో 30వ నెంబరు జాతీయ రహదారిపై పది వాహనాలను అడ్డుకొని నిప్పు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరుకు 25 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. తమను అణచివేసేందుకు కేంద్రరాష్ట్ర బలగాలు ఆపరేషన్ ప్రహార్-3 పేరిట ఛత్తీస్గఢ్లో పలు దాడులకు పాల్పడుతున్నాయని.. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే వాహనాలకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ వేగవంతం చేశాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com