Manasa Varanasi: మిస్ ఇండియాకు కరోనా.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా..

Manasa Varanasi: మిస్ ఇండియాకు కరోనా.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా..
Manasa Varanasi: పోటీదారులలో పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ మిస్ వరల్డ్ ఫైనల్‌ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది.

Manasa Varanasi: దేశంలో కరోనా తన పంజా విసురుతూనే ఉంది.. గత కొద్ది రోజులుగా కేసులు మళ్లీ ఎక్కువవుతున్నాయి. సెలబ్రెటీలు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మిస్ వరల్డ్2021 పోటీలు జరుగుతున్న క్రమంలో అనేక మంది కంటెస్టెంట్లు కోవిడ్ బారిన పడ్డారు. దాంతో ముగింపు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కార్యక్రమం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు గురువారం నాడు ప్రకటన వెలువడింది. పోటీదారులు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. పోటీదారులలో పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ మిస్ వరల్డ్ ఫైనల్‌ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది.

17 మంది పోటీదారులు మరియు సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ సోకిన వారిలో మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటం పొందిన మానస వారణాసి కూడా ఉన్నారు. ఆమె అంతర్జాతీయ అందాల పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈవెంట్‌ను పర్యవేక్షించడానికి నియమించిన వైరాలజిస్టులు, వైద్య నిపుణులతో సమావేశం తర్వాత వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తెలిపింది.

Tags

Next Story