తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపులు..

తమిళనాడులో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మక్కల్ నీధి మయ్యమ్ అధినేత, నటుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో శరత్కుమార్ పార్టీతో కలిసి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు చెన్నైలో జరిగిన సమావేశంలో ఇరువురి మధ్య పొత్తు కుదిరింది.
ఎన్నికల్లో కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టి ఉంటే జత కడుదామనుకున్నారు కమల్. అయితే రజనీ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో కోలీవుడ్లోని పలువురు బడా హీరోలతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు కమల్ హాసన్ వ్యూహరచన చేశారు.
మరోవైపు.. రానున్న ఎన్నికల్లో కమల్ హాసన్ చెన్నై నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎంజీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో పాటు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్ఎన్ఎమ్ పార్టీకి ఇక్కడ దాదాపు 10శాతం ఓట్లను కైవసం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com