రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్

X
By - prasanna |20 May 2021 3:04 PM IST
డీఏపీ ఎరువులపై సబ్సీడీ పెంచుతూ కేద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏపీ ఎరువులపై సబ్సీడీ పెంచుతూ కేద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎరువుల ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఏపీ ఎరువులపై సబ్సిడీ 140% పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో డీఏపీ సంచికి రూ.500గా ఉన్న సబ్సిడీని రూ.1200కు పెంచింది. ఇందుకోసం రూ.14,775 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయనుంది ప్రభుత్వం.
అంతర్జాతీయంగా ధరల పెరుగుదల ఉన్నప్పటికీ రైతు పాత రేట్లకే ఎరువులు పొందాలనేది మోదీ నిర్ణయం. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com