ఇల్లు కొనాలనుకునేవారికో గుడ్‌న్యూస్..

ఇల్లు కొనాలనుకునేవారికో గుడ్‌న్యూస్..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బిల్డర్లు ఇప్పుడు సర్కిల్ రేటు కన్నా 20 శాతం తక్కువకే వారి ప్లాట్లను

సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నానికి తోడుగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇల్లు కొనుగోలు చేసే వారికి పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పిస్తోంది. రూ.2 కోట్ల లోపు ఇళ్లకు ఇది వర్తిస్తుంది. దీనిలో భాగంగానే 20 శాతం ఇన్‌కం ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది. 2021 జూన్ 30 వరకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ, అగ్రిమెంట్ వ్యాల్యూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రెట్టింపు చేసింది.

మోదీ సర్కార్ నిర్ణయంతో ఇటు ఇంటి కొనుగోలు దారులకు అటు హౌసింగ్ డెవలపర్లకు ప్రయోజనం కలగనుంది. ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 43 సీఏ కింద సర్కిల్ రేటు (స్టాంప్ డ్యూటీ వ్యాల్యూ), అగ్రిమెంట్ వ్యాల్యూ (కొనుగోలు ధర) మధ్య వ్యత్యాసాన్ని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతామని కేంద్ర ఆర్ధిక మంతరి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే రూ.2 కోట్ల లోపు ఇళ్లను కొనే వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56 (2) ఎక్స్ కింద 20 శాతం వరకు రిబేట్ లభిస్తుంది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బిల్డర్లు ఇప్పుడు సర్కిల్ రేటు కన్నా 20 శాతం తక్కువకే వారి ప్లాట్లను విక్రయించొచ్చు. దీంతో వారి అమ్మకాలు పెరుగుతాయి. అదే సమయంలో ఇంటి కొనుగోలుదారులకు తక్కువ ధరకే ఇళ్లు లభిస్తాయి. ఇంకా పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. దీంతో రియల్టీ డిమాండ్ పెరుగుతుంది.

Tags

Next Story