రాహుల్ గాంధీకి మరిన్ని ఇబ్బందులు..బిహార్లో కూడా కేసు
ప్రధాని మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల వివాదంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు గానూ బిహార్లోనూ ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. ఆ కేసులో విచారణకు రావాలని పట్నా కోర్టు తాజాగా రాహుల్కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న కోర్టు ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశిల్ కుమార్ మోదీ ... రాహుల్పై ఈ పరువు నష్టం దావా వేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన పట్నాలోని కోర్టు.. ఏప్రిల్ 12న రాహుల్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ప్రస్తుతం సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ వ్యవహారంలో తాము బిజీగా ఉన్నందున విచారణ వాయిదా వేయాలని రాహుల్ న్యాయవాదుల బృందం కోర్టును కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 25వ తేదీకి విచారణ వాయిదా వేసింది. ఆ రోజున రాహుల్ వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com