MP: ఆంజనేయస్వామికే నోటీసులు..!
By - Subba Reddy |13 Feb 2023 6:30 AM GMT
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హనుమంతుడికి హుకుం జారీ చేసిన రైల్వే అధికారులు
మధ్యప్రదేశ్లోని రైల్వే అధికారులు ఏకంగా ఆంజనేయస్వామికి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హనుమంతుడికి హుకుం జారీ చేశారు. మొరెనా జిల్లా సబల్గర్ ప్రాంతంలో రైల్వే బ్రాడ్ గేజ్ పనులు జరుగుతున్నాయి. అయితే హనుమంతుడి ఆలయం ఉన్న ప్రాంతం రైల్వేదని గుర్తించిన అధికారులు వెంటనే దాదాని తొలగించాలంటూ అంజనీపుత్రునికి నోటీసులు జారీ చేశారు. ఆలయ కూల్చివేత, ఆ స్థల పునరుద్దరణకు అయ్యే ఖర్చును కూడా వసూలు చేస్తామని నోటీసులులో తెలిపారు. కాగా దీనిపై స్పందించిన రైల్వే అధికారులు పొరపాటున దేవుడి పేరిట నోటీసులు జారీ చేశామని, గుడి పూజారి పేరిట కొత్త నోటీసు ఇస్తామని వివరణ ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com