'ధోనీ' కూరగాయలు 'దుబాయ్' మార్కెట్లో..

ధోనీ కూరగాయలు దుబాయ్ మార్కెట్లో..
ఆల్ సీజన్ ఫార్మ్ ఫెష్ ఏజెన్సీ ధోని కూరగాయలను దుబాయ్‌లో విక్రయించనుంది.

ఇండియా మాజీ కెప్టెన్ రాంచీ ప్రిన్స్ ఎంఎస్ ధోని ఫామ్ హౌస్ నుండి కూరగాయలు దుబాయ్‌ ప్రజలకు రుచి చూపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ధోని ఫామ్ హౌస్‌లో పండించిన కూరగాయలను దుబాయ్‌కు రవాణా చేయడానికి సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. చర్చలు కూడా చివరి దశలో ఉన్నాయి. దుబాయ్‌కు కూరగాయలు పంపే ఏజెన్సీని కూడా ఎంపిక చేశారు. ధోని కూరగాయలను విదేశాలకు పంపే బాధ్యతను జార్ఖండ్ వ్యవసాయ శాఖ తీసుకుంది.

ఆల్ సీజన్ ఫార్మ్ ఫెష్ ఏజెన్సీ ధోని కూరగాయలను దుబాయ్‌లో విక్రయించనుంది. ఇదే ఏజెన్సీ ద్వారా వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు అనేక కూరగాయలను, సరుకులను పంపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కింద ప్రభుత్వం పనిచేస్తోందని మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలియజేశారు. ధోని ఒక బ్రాండ్.. జార్ఖండ్ పేరు అతని కూరగాయలతో ముడిపడి ఉన్నప్పుడు, ఇక్కడి రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఇక్కడికి రావటానికి ఇష్టపడని అనేక ఏజెన్సీలు కూడా ఇక్కడకు వస్తాయని, ఇక్కడ కూరగాయలను ఇతర దేశాలకు పంపేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ధోని ఫామ్ హౌస్ లో వివిధ రకాల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ధోని ఫామ్ హౌస్ సెంబో గ్రామంలోని రింగ్ రోడ్ వద్ద ఉంది. స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, టమోటాలు, బ్రోకలీ, బఠానీలు, హాక్ మరియు బొప్పాయిలను 43 ఎకరాల ఫామ్ హౌస్‌లోని10 ఎకరాలలో విస్తృతంగా సాగు చేస్తున్నారు. ధోని ఫామ్ హౌస్‌లో పండించిన క్యాబేజీ, టమోటాలు, బఠానీలకు రాంచీ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది.

ధోనికి దుబాయ్‌లో భారీగా అభిమానులున్నారు. మహేంద్ర సింగ్ ధోనీకి దుబాయ్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దుబాయ్‌లో టీమ్ ఇండియా మ్యాచ్ జరిగినప్పుడల్లా, వేదిక వద్ద ధోని అభిమానులు సందడి చేస్తుంటారు.

Tags

Read MoreRead Less
Next Story