Mumbai: రైలు కింద పడి రైల్వే అధికారి ఆత్మహత్య

Mumbai: రైలు కింద పడి రైల్వే అధికారి ఆత్మహత్య
చూస్తుండగానే క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం.. ప్రయాణికులు షాక్‌

ముంబై రైల్వేస్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే రైల్వే ఇన్‌స్పెక్టర్‌ రైలుకింద దూకి ఆత్మహత్య సుకున్నాడు. ఈ సంఘటన మొత్తం స్టేషన్‌లోని సీసీకెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోలో అంతసేపు ఏమీ పట్టనట్టు ఉన్న రైల్వే ఇన్‌స్పెక్టర్‌ స్టేషన్‌లోకి సమీపిస్తున్న రైలు దెగ్గరకు రాగానే పట్టాలపై దూకి అడ్డంగా పడుకున్నాడు. ప్లాట్‌ఫామ్‌ మీద ఉన్నవారు ఏమి జరిగిందో తెలుసుకునే లోపే క్షణాల్లో రైలు అతనిపైనుంచి వెళ్లిపోయింది. ఇది చూసిన ప్రయాణికులు నివ్వెర పోయారు. ఈ ఘటనపై విలే పార్లే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌ ఆత్మహత్య వెనక పనికి సంబంధించిన ఒత్తిడి ఏమీలేదని, అతడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో పోలీసుల విచారణలో తేలుతుందని పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story