Mumbai: ఉగ్ర నీడలో ఎయిర్ పోర్ట్..
By - Chitralekha |7 Feb 2023 7:37 AM GMT
ముంబై ఎయిర్ పోర్ట్ పై ఇండియన్ ముజాహిద్దీన్ కన్ను: భద్రత పెంచిన అధికారులు
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయానికి ఉగ్ర బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం గుర్తు తెలియని వ్యక్తి ఎయిర్ పోర్ట్ అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తనని తాను ఇర్ఫాన్ అహ్మద్ షేక్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి, తాను నిషేధానికి గురైన ఇండియన్ మోజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు చెందినవాడినని తెలిపినట్లు సమాచారం. ఈమేరకు అప్రమత్తం అయిన ఎయిర్ పోర్ట్ అధికారులు హుటాహుటిన భద్రతను రెండింతలు పెంచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు దర్యప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com