Nagaland : ఐదోసారి ముఖ్యమంత్రిగా నీఫియు రియో
నాగాలాండ్ రాజకీయ దిగ్గజం నీఫియు రియో ఐదోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. తాజా ఎన్నికల్లో అధికారానికి అవసరమైన పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీపీపీ కూటమి.. మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఐదోసారి సీఎంగా నీఫియు రియో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని సుదీర్ఘకాలంగా పాలించిన ముఖ్యమంత్రిగానూ రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు సీఎంగా కొనసాగిన నేతగా ఎస్సీ జమీర్ నిలిచారు.
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీతో కలిసి అధికార ఎన్డీపీపీ పోటీ చేసింది. తాజా ఫలితాల్లో ఎన్డీపీపీ 25 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 12చోట్ల గెలిచింది. మొత్తంగా ఈ కూటమి 37 స్థానాలను కైవసం చేసుకుని మెజార్టీ మార్కు 31ని దాటింది. దీంతో నీఫియు రియో మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com