National: నేరస్తులను మట్టిలో కలిపేస్తాం : సీఎం యోగీ

National: నేరస్తులను మట్టిలో కలిపేస్తాం : సీఎం యోగీ
ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ ను శుక్రవారం హత్య చేశారు. అతని గన్ మెన్ లలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు

సమాజ్ వాద్ పార్టీ నేరస్తులను, మాఫియాను ప్రోత్సహిస్తోందని అన్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్. శనివారం అసెంబ్లీలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై విరుచుకుపడ్డారు యోగీ . నేరస్థులను యూపీ ప్రభుత్వం మట్టిలో కలిపేస్తుందని అన్నారు.

2005లో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యలో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ ను శుక్రవారం హత్య చేశారు. అతని గన్ మెన్ లలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజీమ్ ను ఎన్నికల్లో రాజుపాల్ యాదవ్ ఓడించాడు. దీంతో అతన్ని ఖలీద్ వర్గం హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉమేష్ పాల్ ఉన్నారు. దీంతో ఉమేష్ ను ఖలీద్ వర్గం శుక్రవారం చంపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజుపాల్ కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరు జైల్లోనే ఉన్నారు.

మాజీఎంపీ అతిక్ అహ్మద్ కు ఎస్పీ మద్దతు ఇచ్చిందని అన్నారు సీఎం యోగీ. రాష్ట్రంలో అశాంతిని రేపుతూ, నేరస్తులకు మద్దతు ఇస్తూ, ఆపై శాంతి భద్రతలపై అఖిలేష్ డ్రామా సృష్టిస్తున్నారని యోగి మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story