National: భారత్ను విదేశాల్లో అవమానించింది మోదీనే: రాహుల్

X
By - Subba Reddy |6 March 2023 11:00 AM IST
దేశ అభివృద్ధి కోసం పాటుపడిన వారిని అవమానించి, విదేశాలకు వెళ్లి భారత్ను అవమానించింది ప్రధాని మోదీ తప్ప వేరెవ్వరూ కాదు
విదేశాల్లో భారత దేశాన్ని అవమానించింది తాను కాదు.. ప్రధాని మోదీయే అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ విదేశాలలో భారత్ గురించి చెడుగా మాట్లాడుతూ.. పరువు తీస్తున్నారని బీజేపీ నేతలు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై లండన్లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ స్పందించారు. తన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడానికి ముందు 60 ఏళ్లలో భారత్లో అవినీతి విపరీతంగా ఉండేదని.. ఎలాంటి అభివృద్ధి జరగలేదని మోదీ విదేశాలలో మాట్లాడారని రాహుల్ ఆరోపించారు. ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడిన వారిని అవమానించారని అన్నారు. విదేశాలకు వెళ్లి భారత్ను అవమానించింది ప్రధాని మోదీ తప్ప వేరెవ్వరూ కాదని రాహుల్ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com