Noida : ఏరులై పారిన బీరు... రూ.9 కోట్లు తాగేశారట...

Noida
Noida :  ఏరులై పారిన బీరు... రూ.9 కోట్లు తాగేశారట...
నోయిడాలో తారాస్థాయికి చేరుకున్న మద్యం అమ్మకాలు; న్యూ ఇయర్ వేడుకల్లో తెగ తాగేశారట....

నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో న్యూ ఇయర్ వేడుకలకు మద్యం అమ్మకాలు పెద్దగా జరగకపోగా ఈ సారి మాత్రం మందు బాబులా వారి సత్తాను చూపించారు. కిందటి ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి మద్యం అమ్మకాలు ఆకాశాన్ని అంటాయని చెప్పుకోవచ్చు.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్క రోజే రూ. 9 కోట్లకు పైగా మద్యం విక్రయాలు నమోదయ్యాయి, గత ఏడాది కంటే 23 శాతం ఎక్కువ. ఇక డిసెంబర్ నెల మొత్తంలో దాదాపు రూ.139 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

అమ్ముడు పోయిన మద్యంలో దేశీయ మద్యంతో పాటు విదేశీ అలాగే బీరు కూడా ఉన్నాయి. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాటు జరగడంతో ఆదాయం పెరిగింది.

గౌతమ్ బుద్ధ నగర్ వాసులు డిసెంబర్ 31న అంటే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2,30,000 లీటర్ల మద్యం సేవించారని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story