యాసిడ్ దాడిలో బాధితురాలికి కొత్త జీవితం..!

X
By - TV5 Digital Team |3 March 2021 7:45 PM IST
యాసిడ్ దాడిలో గాయపడిన ఓ బాధితురాలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ప్రమోదిని రౌల్.. తన మిత్రుడు సరోజ్ సాహును సోమవారం పెళ్లాడింది.
యాసిడ్ దాడిలో గాయపడిన ఓ బాధితురాలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ప్రమోదిని రౌల్.. తన మిత్రుడు సరోజ్ సాహును సోమవారం పెళ్లాడింది. తాజాగా ఆ పెళ్లి ఫొటోను నెట్టింట షేర్ చేసిన ఆమె.. 2014లో ఇద్దరికీ పరిచయం ఏర్పడినట్లు చెప్పింది. ఏళ్లుగా తనకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు అతడి కుటుంబం మద్దతుగా నిలిచిందని పేర్కొంది. 2009లో 16 ఏళ్ల వయసున్నప్పుడు ప్రమోదినిపై యాసిడ్ ఎటాక్ జరిగింది. ఇక సరోజ్ సాహు మాట్లాడుతూ.. తన స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో తనకు తెలియదని కానీ తనని పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com