Odissa: ఈ పావురం ఓ గూఢాచారి

X
By - Chitralekha |9 March 2023 12:27 PM IST
స్పై కెమెరాతో పట్టుబడ్డ పావురం; ఒడిశాలోని జగత్సింగ్ పూర్ లో కలకలం
ఒడిశాలోని పారాదిప్ తీరంలో ఓ అనుమానస్పద పావురాన్ని భద్రతా అధికారులు కనుగొన్నారు. పావురం కాలికి కెమెరాతో కూడిన మైక్రోచిప్ బిగించి ఉందని తెలుస్తోంది. జగత్ సింగ్ పూర్ జిల్లాలోని పారాదిప్ తీరంలో ఓ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా, అతడికి ఈ పావురం చిక్కినట్లు అధికారులు చెబుతున్నారు. సదురు మత్స్యకారుడు అనుమానస్పదంగా కనిపించిన పావురాన్ని మెరైన్ పోలీసులకు అప్పగించగా, పావురం కాలికి బిగించిన ఉన్న వస్తువు కెమెరానా కాదాన్న అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఏఎస్పీ అధికారి సేఠీ వెల్లడించారు. సైబర్ నిపుణుడికి పావురాన్ని అప్పగించినట్లు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com