టీవీ, ఫ్రిజ్ ఉందా.. అయితే రేషన్ కట్..

టీవీ, ఫ్రిజ్ ఉందా.. అయితే రేషన్ కట్..
X
రేషన్ ఎవరికి ఇస్తారండి.. ఇల్లూ వాకిలి లేనివాళ్లకి..

రేషన్ ఎవరికి ఇస్తారండి.. ఇల్లూ వాకిలి లేనివాళ్లకి.. ఇల్లుండి అందులో ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ, టూ వీలర్ ఉంచుకుని కూడా రేషన్ కావాలంటే ఎలా చెప్పండి.. ఈ విషయంలో ఇకపై చాలా స్ట్రిక్ట్‌గా ఉంటామంటున్నారు బెంగళూరు ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి. బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఉన్నత వర్గాలు కూడా ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులను ఉచితంగా తీసుకోవడం వలన వెనుకబడిని వారికి అందడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తోందని, ఇకపై సరైన అర్హుల జాబితాను రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ద్విచక్ర వాహనం, టీవీ, ఫ్రిజ్ లేదా ఐదు ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయించింది. అలా ఎవరైనా రేషన్ కార్డు కలిగి ఉంటే వారంతా మార్చి 31 లోపు కార్డులను తమకు అప్పగించాలని లేదంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ప్రజలను కోరింది.

కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలపై విరుచుకుపడింది మరియు పార్టీ కార్యకర్తలు బెంగళూరులోని వివిధ రేషన్ షాపుల ముందు నిరసనలు చేశారు. పార్టీ కార్యకర్తలు ధార్వాడ్, మైసూరు, తుమకూరులలో కూడా నిరసన వ్యక్తం చేశారని కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.

సిద్దరామయ్య ప్రభుత్వంలో ఆహార, పౌర సరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయం తన ముందు వచ్చిందని, చాలా మంది పేద ప్రజలు ప్రభావితమవుతున్నందున నిబంధనలను సడలించకూడదని తాను నిర్ణయించుకున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే యుటి ఖాదర్ అన్నారు. టీవీ, ఫ్రిజ్ అనేవి నేడు నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయాయని, వాటిని కారణంగా చూపి రేషన్ కార్డులను తొలగించడం సరికాదని అంటున్నారు.

Tags

Next Story