Uttarakhand : బిడ్డను కనండి.. లేదా రూ.5 కోట్లు ఇవ్వండి.. కొడుకు, కోడలిపై కేసు పెట్టిన తల్లిదండ్రులు

Uttarakhand : బిడ్డను కనండి.. లేదా రూ.5 కోట్లు ఇవ్వండి.. కొడుకు, కోడలిపై కేసు పెట్టిన తల్లిదండ్రులు
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఒక విచిత్రమైన కేసు వెలుగుచూసింది.. ఎస్ఆర్ ప్రసాద్ దంపతులు తమ కొడుకు, కోడలుపై కోర్టు మెట్లు ఎక్కారు.

Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఒక విచిత్రమైన కేసు వెలుగుచూసింది.. ఎస్ఆర్ ప్రసాద్ దంపతులు తమ కొడుకు, కోడలుపై కోర్టు మెట్లు ఎక్కారు.. ఒక సంవత్సరంలోపు మనవడో, మనవరాలినో ఇవ్వాలని లేకపోతే దానికి బదులుగా అయిదు కోట్ల రూపాయల పరిహారమైనా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు.

మనవడో, మనవరాలినో ఇస్తే చివరి రోజుల్లో వారితో కలిసి ఆడుకుంటూ సంతోషంగా గడుపుదామని అనుకున్నారు ఆ జంట.. కానీ కొడుక్కి 2016లో పెళ్లి చేస్తే వారు ఇప్పటికి ఎలాంటి శుభవార్త చెప్పకపోవడంతో విసిగిపోయారు. దీనితో వారు పిల్లల్ని కనండి లేదా ఐదు కోట్లు ఇవ్వండి అంటూ కొడుకు, కోడలు పైన కోర్టు మెట్లు ఎక్కారు.

దీనిపై ఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ.. "నేను నా కొడుకుకు బాగా చదివించాను.. అమెరికాలో శిక్షణ కూడా ఇప్పించాను. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. ఇల్లు కట్టుకోవడానికి మేము బ్యాంకు నుండి రుణం తీసుకున్నాము. ప్రస్తుతం మేము ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉన్నాము. మేము మా పిటిషన్‌లో కొడుకు మరియు కోడలు నుండి ఒక్కొక్కరి నుంచి రూ. 2.5 కోట్లు డిమాండ్ చేసాము." అని పేర్కొన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story