ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15 వరకు మొదటి విడత సమావేశాలు జరగనున్నాయి.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15 వరకు మొదటి విడత సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం... సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతారు. ఫిబ్రవరి 1 వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. దీనిపై 15 వ తేదీ వరకు చర్చ జరుగుతుంది. అనంతరం మార్చి 8 వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8 వ తేదీ వరకు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది.

Tags

Read MoreRead Less
Next Story