వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ పార్థివ్ పటేల్ రిటైర్మెంట్
వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ పార్థివ్ పటేల్ బుధవారం అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. పటేల్ 2002 లో 17 సంవత్సరాల వయసులో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 25.13 మ్యాచ్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 31.13 సగటుతో 934 పరుగులు చేశాడు. 38 వన్డేలు, రెండు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు. అతను చివరిసారిగా 2018 లో జొహన్నెస్బర్గ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత జెర్సీ ధరించాడు. ఎడమ చేతితో బ్యాట్స్ చేసిన కీపర్గా రాణించిన పార్థివ్ తన రిటైర్మెంట్ను ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
"ఈ రోజు నేను అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాను. ఈ 18 సంవత్సరాల క్రికెట్ ప్రయాణంలో నేను చాలా మంది పట్ల కృతజ్ఞతతో ఉన్నాననిభావిస్తున్నాను. 17 సంవత్సరాల వయస్సులో బిసిసిఐ నాపట్ల విశ్వాసం చూపించింది. భారతదేశం కోసం ఆడటానికి అవకాశం కల్పించినందుకు వారి పట్ల నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను" అని పటేల్ తన సుదీర్ఘ ట్విట్టర్ పోస్ట్లో పేర్కొన్నారు.
" గుజరాత్ క్రికెట్ అసోసియేషన్కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, నాకు ఇచ్చిన నాయకత్వ పాత్రను సరిగా నెరవేర్చలేదు" అని అన్నారాయన. పటేల్ భారత దేశీయ క్రికెట్లో ఒక బలమైన ఆటగాడు. 194 ఫస్ట్-క్లాస్ ఆటలలో 27 సెంచరీలు, 67 అర్ధ సెంచరీలతో 11,000 పరుగులు చేశాడు. అతను కొన్ని సీజన్లలో రంజీ ట్రోఫీలో గుజరాత్కు నాయకత్వం వహించాడు. 2016-17 సీజన్లో వారి మొట్టమొదటి టైటిల్ విజయానికి కూడా కారణమయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో పటేల్ తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల కోసం ఆడాడు. అతను తన రాష్ట్రం నుండి వివిధ ఐపిఎల్ ఫ్రాంచైజీల కోసం 204 టి 20 మ్యాచ్లు ఆడాడు. 23 అర్ధ సెంచరీలు చేసి 123.84 స్ట్రైక్ రేట్లో 4,300 పరుగులు చేశాడు.
— parthiv patel (@parthiv9) December 9, 2020
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com