ఇందన ధరల పెంపుపై సుప్రీంకోర్టులో పిటిషన్.. మండిపడ్డ న్యాయస్థానం

ఇందన ధరల పెంపుపై సుప్రీంకోర్టులో పిటిషన్.. మండిపడ్డ న్యాయస్థానం
పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేరళకు చెందిన న్యాయవాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేరళకు చెందిన న్యాయవాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నా.. పెట్రోల్, డీజిట్ ధరలు మాత్రం పెంచుతున్నారని ఈ విషయంలో న్యాయంస్థానం జోక్యం చేసుకోవాలని పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్థిక విధానానికి సంబంధించిన అంశంపై పిల్‌ వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. పిటిషన్‌ను కొనసాగించాలనుకుంటే పిటిషనర్‌ భారీ జరిమానా కట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో పిటిషన్‌ను సదరు పిటిషనర్ వెనక్కు తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story