Narendra Modi : తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పీఎం మోడీ ఏరియల్ సర్వే.. !

X
By - TV5 Digital Team |19 May 2021 4:31 PM IST
గుజరాత్ లో తాక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దేశ ప్రధాని మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే లో గుజరాత్ ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
గుజరాత్ లో తాక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దేశ ప్రధాని మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే లో గుజరాత్ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వున్నా, డియా, జఫరబాధ్, మహువా, సౌరాష్ట్రలోనీ తీర ప్రాంతాలలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ ప్రధాని మోడీ సర్వే చేశారు. ఢిల్లీ నుంచి విమానంలో గుజరాత్ కి చేరుకోగానే.. గవర్నర్ ఆచార్య దేవ రాజ్, సీఎం విజయ్ రూపనీ స్వాగతం పలికారు. తుఫాను లో 16 వేల ఇళ్లు ధ్వంసం కాగా 40 వేల చెట్లు, 70 వేల కరెంటు స్తంభాలు కూలిపోయాయి. చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సర్వే అనంతరం అధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు. నష్టం అంచనాలు సహాయక చర్యల పురోగతి పై అడిగి తెలుసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com