కొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని.. మోదీకి టీకా ఇచ్చింది ఎవరంటే..!
తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్ ద్వారా ప్రకటించారు.

ప్రధాన నరేంద్ర మోదీ కొవిడ్ టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ టీకాను మోదీ తీసుకున్నారు. మోదీకి సిరంజీ ద్వారా ఎయిమ్స్ సిస్టర్ పి.నివేదా టీకా ఇచ్చారు.
దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఇవాల్టి నుంచి టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్ ద్వారా ప్రకటించారు.
కొవిడ్కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కొవిడ్ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
— Narendra Modi (@narendramodi) March 1, 2021
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
RELATED STORIES
Anil Ravipudi: నెగిటివ్ కామెంట్స్కు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఘాటు...
28 May 2022 10:15 AM GMTRam Gopal Varma: పంజాగుట్ట పోలీస్స్టేషన్కు రాంగోపాల్వర్మ.. ఆ...
28 May 2022 10:00 AM GMTSarkaru Vaari Paata OTT: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. డేట్ ఫిక్స్..
28 May 2022 9:30 AM GMTRana Daggubati: నాగచైతన్యపై రానా కామెంట్స్.. సోషల్ మీడియాలో హాట్...
27 May 2022 2:15 PM GMTPatton Oswalt: 'ఆర్ఆర్ఆర్'పై హాలీవుడ్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
27 May 2022 1:15 PM GMTBalakrishna: బాలయ్య సినిమాలో హీరోయిన్ ఛేంజ్.. ఈసారి తెరపైకి కొత్త...
27 May 2022 12:15 PM GMT